16/01/2021
ఈరోజు దేశవ్యప్తంగ కోవిడ్ 19 వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేస్తున్న సందర్భంగా మన దేశ ప్రధాని
*గౌరవ శ్రీ నరేంద్ర మోడి గారికి పాలాభిషేకం చేసిన భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట మండల కమిటి*
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాయపురపు కుమారస్వామి మాట్లాడుతూ
ఈ రోజు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడుకునేందుకు ప్రారంభించిన *ఉచిత కో వ్యాక్సిన్* కార్యక్రమంలో దేశ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాల్లు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలో ఫోటో పెట్టకుండా, ఎక్కడా వారి పేరును ప్రస్తావించకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారిని అవమానించారని వారన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు ఈ వ్యాక్సిన్ను అందించి ప్రపంచ ప్రజలను సైతం కరోణ బారినుండి రక్షిస్తున్న మన భారత ప్రధానమంత్రి గారిని మన తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి కృషిని ,శ్రమను గుర్తించకుండా అవమానించడం దురదృష్టకరమని ,
దీనిని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని ,ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని వారు హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే అమలవుతున్న , నిసిగ్గుగ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటుందని ,
కానీ ఈరోజు భారతీయ జనతాపార్టీలోని ప్రతి కార్యకర్త రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి వచ్చే నిధులను ప్రజల వద్దకు తీసుకువెళ్లేపనిలో ఉందని,
ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారని,
కేంద్ర ప్రభుత్వం వారికి అందించే సంక్షేమ ,అభివృద్ధి పథకాలను ప్రజలు తెలుసుకుంటున్నారని రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం కట్టడానికి ప్రజలు సిద్ధం అవుతున్నారని,
వారు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీరితోపాటు జిల్లా ఓబిసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పెద్దూరి రాజ్ కుమార్, నాయకులు జడ సతీష్ ఐత రవి, యువ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ ఎలిషాల రాకేష్, మూడవ డివిజన్ కార్పొరేటర్ కొండేటి అనిత, సత్యం మండల ఉపాధ్యక్షులు న్యాలం సాయిలు ,మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణమూర్తి, పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లె పాక అనిల్ ,కిసాన్మోర్చా మండల అధ్యక్షులు కర్క సోమిరెడ్డి ,యువ మోర్చా మండల అధ్యక్షులు చెంగల సురేష్ ,యువ నాయకులు చిటూరి రాజు ,యువమోర్చా మండల ప్రధాన కార్యదర్శి రామ్ రాజ్ ,తదితరులు పాల్గొన్నారు.